గమనిక : తైలాభిషేక పండుగలు 2018 ఆగస్టు 9,10 బైబిల్ మిషను స్వస్థత శాల, గుత్తి, అనంతపురం
జిల్లా
ఈ కూటములకు రాకడ
వుపవాసములనీయు, వరముల
కొరకైనా వుపవాసములనియు, అద్భుత
శక్తి కొరకు ప్రార్థించు దినములనియు, దైవసన్నిధి ధ్యాన
దినములనియు పేర్లు గలవు.
ఈ కూటములను బైబిలు మిషను సంఘములన్నియు జులై 1 నుండి ఆగస్టు 9 వరకు (40 దినములు)
జరిగించుకొని ఆగస్టు 10 వ తేదీన సన్నిధి
పండుగ లేక తైలాభిషేక పండుగ
జరుపుకొందురు.
ఈ కూటములు చేయు విధము :
1.
అందరూ మోకరించి త్రియేక దేవుని స్తుతి
మూడు మార్లు చెప్పవలెను. అదేమనగ – “ తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందును
ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు మహిమా, మహిమా, మహామహిమ, ఘనత, కీర్తి ప్రభావములు కలుగును గాక! ఆమేన్”
( ఒకరు చెప్పుచుండగా అందరూ పలుకావలెను)
2.
ఆలుగననే మోకరించియుండగా ప్రారంభ ప్రార్ధన చేసి, తర్వాత త్రియేక దేవుని స్తుతి కీర్తన
“ శుభాకరా శుధాకరా” పాడవలెను.
3. 3. ఆ తర్వాత కూర్చొని దైవజనుడు
దేవదాసు అయ్యగారు వ్రాసిన కీర్తనలలో ఏవేని 3 సన్నిధి కీర్తనలు పాడవలెను.
4. 4. తర్వాత మోకరించి “ దైవలక్షణముల స్తుతులు, సైతాను నేదిరించు సూత్రములు,
సమర్పణ ప్రార్ధన, రాకడ ప్రార్ధన” చేయవలెను.
( ఒకరు చెపుచుండగా అందరూ పలుకవలెను)
5. 5. తర్వాత లేచి నిలవబడి బైబిలు
గ్రంథములో నీర్గమకాండములోని 40 అధ్యాయములను రోజుకు ఒక ఆధ్యాయము చొప్పున చదవవలెను.
6. 6. తర్వాత మోకరించి 7 మెట్ల
ధ్యానములో 6 మెట్లను ( అనగా 1. మనోనిదానము, 2. పాపపుటోప్పుదల, 3. తీర్మానము, 4. సమర్పణ, 5. స్తుతి, 6.
అంశాప్రార్ధన మెట్లను) 10 లేక 15 నిమిషములలో
ముగించుకొని 7 వ మెట్టులో దేవా! నాకు కనబడుము నాతో
మాట్లాడుము, దేవా! అందరికీ
కనబడుము అందరితో మాట్లాడుము అని ప్రార్ధించి 2 గంటల
సేపు మౌనముగా కనిపెట్టవలెను. ( అధమపక్షము 1 గంటయైనను మౌనముగా కనిపెట్టవలెను)
7. 7 కనిపెట్టిన తరువాత ప్రార్ధన
చేసుకొని ముగించుకొనవచ్చును.
గమనిక: పగలు ఈ కూటము చేసుకొను వారు ఉదయము
నుండి మçï 3
గంçï ల
వరకు ఉపవాసముండి ఆ తరువాత భోజనం చేయవచ్చును. రాత్రి కాలమందు చేయువారు మçï
3 గంçïల నుండి రా 9 గంçïల వరకు ఉపవాసముండి ఆ తరువాత భోజనం చేయవచ్చును. అందువలననే ఈ కూటములకు
సుఖోపవాసములు అను పేరు కలిగినది.
ఈలాగున 40 దినములు సన్నిధి ధ్యానములు
ఎవరు సరిగా చేయూదురో అట్టివారికి తైలాభిషేక పండుగ ద్వారా 7 రకముల అభిషేకములు
దేవుడు అనుగ్రహించును.
1. తైలబిషేకము, 2. రక్తాబిషేకము,
3. ఆత్మాభిషేకము, 4. ఆనంద భిషేకము, 5. ఆరోగ్య అభిషేకము, 6. ఈశ్వర్య అభిషేకము, 7. ఆగమన అభిషేకము,
అందువలననే
బైబిలు మిషను – గుత్తి స్వస్థత శాలకు వచ్చు భాహువిస్తార విశ్వాసులు సంవత్సర ఆరంభము
నుండి తైలాభిషేక పండుగల కొరకు ఆశతో ఎదురుచూచెదరు. తైలాభిషేక పండుగ నుందు వేలాది ప్రజలు
తలస్నానము చేసి, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉపవాసముతో ఏకీభవించి భక్తిశ్రద్ధలతో
దేవుని వాక్యము విని, ధ్యానములో పంక్తులు తీరి మోకరించి
యుండగా తైలము తీసుకొని యేసునామములో ప్రార్ధించి ఒక్కొక్కరి తలపై పోయబడును. అభిషేక కార్యక్రమము అనంతరం ఆల్టరు మీద దైవసేవకులు మొదటి క్రోవ్వోత్తిని
వెలిగించగా ఆ క్రొవ్వొత్తి వెలుగుతో సంఘమంతా ఒకరినొకరు మైనపు వతులు వెలిగించుకొని, వాటిని పట్టుకొని “ నేను వెలుగుడును అనేకులను వెలిగించేదనని” ప్రమాణము
చేయుట జరుగును. అనంతరం అందరికీ ఆశీర్వాద భోజన ఏర్పాట్లు గావించబడును.అంతేగాక
బైబిలు మిషను – గుత్తి ప్యారిష్ కు చెందిన సంఘములలో పలుచోట్ల తైలాభిషేక పండుగలు నీర్వహించబడి
దేవుని ఘనపరచుట జరుగును. అందరూ తైలాభిషేక పండుగ కొరకు 40 దినములు సన్నిధి
ధ్యానములు చేసి సిద్ధపడి పాల్గొనండి.
1
కోడిగ్రుడ్లు పిఐఎల్లలుగా మారుటకు తల్లి ఆ గ్రుడ్లపై 21 రోజులు కూర్చుండినప్పుడు, ఆ తళ్ళికోడి వేడి
గ్రుడ్లలోనికి వెళ్ళి పిల్లలు ఎలాగూ బయటకు వచ్చునో
2.
అసహ్యముగా కనిపించు గొంగళి పురుగు కొద్దిదినములు ఎవరికిని కనబడకుండ లోపలికి వెళ్ళి
అందమైన సీతాకోకచిలుకగా మారి ఎలాగు బయటకు వచ్చునో ఆలాగుననే దైవసన్నిధిలోనికి వెళ్ళి
వారు, ఎటువంటివారైనాను
దైవలక్షణములు అద్దబడి దేవుని రూపములోనికి వచ్చేదరని గమనిచగలరు. అందువలననే సన్నిధి
కూటములను “నీతి సూర్యుని కళలద్దు దైవసన్నిధి” అని పిలిచేదారు. “ సుర్యుండు
పువ్వులకెంతో సొగసైన రంగులద్దున్ – సుర్యుండైనట్టి యెస్సు శుభగుణములద్దీన్”. ఆ
యుద్దకంబు వాడి అంతర్థానంబైపోవు – ఈ యుద్దకంబు పోదు ఇది శాశ్వతముండు”. దేవుడు
మీమీదకు ఈ ధ్యానముల ద్వారా రావలసిన దీవెనలు మెండుగా కుమ్మరించును గాక! ఆమెన్.
ప్రభువు చెప్పగా దైవజనుడు దేవదాసు అయ్యగారు ఈ కూటములకు మోషే సుఖోపవాస కూటములని పేరు పెట్టియున్నారు. బైబిలు గ్రంథములో హనోకు, అబ్రహాము, ఎలీయా, ఎలీషా, పేతురు, యోహాను, పౌలు మొ గు ఎందరో భక్తులు, శిష్యులు, ప్రవక్తలు ఉండగా ఈ కూటములకు ఎందుకు మోషే పేరు పెట్టబడినదో గమనించవలసిన వారమైయున్నాము.
మోషే సుఖోపవాస కూటములు అనే పేరు ఎలవచ్చింది?

ప్రభువు చెప్పగా దైవజనుడు దేవదాసు అయ్యగారు ఈ కూటములకు మోషే సుఖోపవాస కూటములని పేరు పెట్టియున్నారు. బైబిలు గ్రంథములో హనోకు, అబ్రహాము, ఎలీయా, ఎలీషా, పేతురు, యోహాను, పౌలు మొ గు ఎందరో భక్తులు, శిష్యులు, ప్రవక్తలు ఉండగా ఈ కూటములకు ఎందుకు మోషే పేరు పెట్టబడినదో గమనించవలసిన వారమైయున్నాము.
430 సం ల కాలము దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల
ఇగుప్తలో బానిసత్వములో వున్నారు. 430 సం ల తరువాత మోషే అను దైవజనుని నాయకత్వమున
దేవుడు వారిని బానిసత్వము నుండి విడిపించి బయటకు తీసుకొని వచ్చినారు. అంతేకాక ఎర్ర
సముద్రమును దేవుడు పాయలు చేసి ఆరిన నేయలమీద నడిపించి ఆవలికి చేర్చి, వెనక వెంబడించుచు
నీళ్ళ గోడల మద్యనున్న శత్రువులైన ఇగుప్తీయులను
సీసమువలే మునిగిపోవునట్లు అద్భుతం చేశారు. మరియు చేదునీటిని మద్దురముగాను, బండలోనుండి నీరు వచ్చునట్లుగానూ, ఆకాశములోనుండి
పూరేళ్లు రప్పించి మాంసము అనుగ్రహించుటయేగాక దేవదుతాల ఆహారమైన మన్నాను కురిపించి, పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి
నడిపించుచూ సినాయి అనే కొండ వద్దకు చేర్చియున్నప్పుడు,
నిర్గమ కాండము 19, 24, 33 అధ్యాయములను
జాగ్రత్తగా అధ్యయనము చేసిన యెడల 1. కొండక్రింద నున్న ఇశ్రాయేలియులు, సినాయికొండ మీదికి దేవుడు రాగా సకిగిన ధూమమును,
అగ్నిని చూచినట్లు గాను (ముప్పడంతలు పంట).
2. కొండ మధ్యభాగమున నున్న మోషే, అహరోను, నాడాబు అభీహు, ఇశ్రాయెలియులలో 70 మండి దేవుని పాదాల
క్రిందనున్న నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు,
ఆకాశమండలపు తేజమువంటి దానిని చూచినట్లుగానూ ( అరవడంతల పంట) 3. ఆ తరువాత దేవుడు
పిలువగా కొండ శిఖరమునకు వెళ్ళిన మోషే దేవునిని ముఖాముఖిగా చూచినట్లుగానూ (నూరంతల
పంట) గమనించగలము ఈ పత్రికనను పాఠింమచుచున్న పాఠకులకు పై మూడు అనుభవములలో ఏ
అనుభవములో వున్నారో గమనించి దేవుని ముఖాముఖిగా చూచే అనుభవములోనికి రావలెనని, అందులాకేయ దేవుడు బైబిలు మిషనును బయలుపరచి యున్నారని గ్రహించగలరు. ఇందును
బట్టి ఈ కూటములకు మోషే సుఖోపవాస కుతములను పేరు కలిగినది. కేవలము శరీరక్ మిలుల
కొరకు మాత్రమే కాకుండా యుగయుగములు, యుగయుగాంతముల
రాజ్యామిచ్చే దేవుని వైపు చూచేదము.
ప్రార్థన:- తండ్రీ! నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రీ! వందనములు.
నీ సన్నిధిలేని స్థలములేధు. నీ సన్నిధికాంతి ప్రసరింపని చోటులేదు. పొడలోని
సన్నిధిని యెడలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్యమర్మమెట్లు గ్రహింపగలము! సర్వ
సంపూర్ణత నీ సన్నిఘిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి
పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి, ఈ వాక్య భాగమును
వెలిగించుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్.
నిర్గమకాడములో ఒక కథ :-
ఒక పొద ఉన్నది. ఆ పొడలో
అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో
మాటలాడినాడు. మోషే దేవునితో మాటలాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్లుమని
అబ్రహాముతో అనగా వెంటనే దేవునిమాట ప్రకారం వెళ్ళేను.
ఇక్కడ దేవుడు మోషే
ఇగుప్తుకు వెల్లుమంటే నీవేవారినైనా పంపుకొనుము నేను వెళ్లలేను, నేను నత్తివాడను అని
సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపేను.
ప్రభువు అక్కడ ఒక మాట
చెప్పాడు. ఈ పొద స్థలము పరిశుద్ధస్థలము గనుక నీ చెప్పులు తీసివేయుము అని అన్నాడు.
మోషే దేవుని యోడుట ఎదిరించి ఏమన్నను బాగేగాని
పొద దగ్గర దేవునిచూచేను. దేవుని సన్నిధిని చూచేను. దేవుని మాటలు విన్నాడు.
ఎంత ధాన్యత! ఎంత ధన్యత! దేవుని ఎదిరించే ఈ మురాభి మనిషికి ఎంత ధాన్యత వచ్చింది!
దేవుని సన్నిధివల్లనే దాన్యథ వచ్చింది. సన్నిధివల్లనే చివరకు దేవునిమాట విన్నాడు.
ఈ
మురాభి మనిషికి ఎంత ధాన్యత వచ్చింది? ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్లలేదు. గొర్రెలు కాయుటకు వెళ్ళేతే
దేవుని సన్నిధి వచ్చింది. ఒకదానికిపోతే మరొకటి వచ్చింది. అలాగే ఇప్పుడుకూడా ఎలాంటీ
దుర్మార్గుడైన సరే దువుని సన్నిధికి వెళ్ళారా? దొరికేడే దొరుకును.
1.
గద్దింపులు 2. వర్తమానము 3. అద్భుతములు. 4. ధైర్యము 5. సేవ 6. ఆదరణ. ఈ
మొదలైనవి దొరుకున నేడుకూడా దొరుకును. నేడును మీ గ్రామములలో సన్నిధి
కూటముపెట్టుకోండి. అప్పుడు ఇవన్నియు దొరుకును.
మోషే
పొద దగ్గరనుండి ఇగుప్తుకువెళ్లి, ఇగుప్తునుండి ఎర్రసముద్రముదాటి అడవిలో ఉన్న సీనాయి
పర్వతము ఎక్కినాడు. మంచి ఉన్నతమైన కొండ. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినాడు. అక్కడ
దేవునితో ముఖాముఖిగా దేవునితో మాటలాడే ధాన్యత దొరికింది. మానవల ఒకగంటకాదు. 40
రోజులు తిండి. తిప్పలులేవు. గొప్ప సన్నిధి. మనలో ఎవరైనా 40 దినములు దైవసన్నిధిలో
ఉంటే చచ్చిపోతారు. అన్నంలేక, నీళ్లులేక ఛస్తారు. ఈ మోషే
మాత్రము చావలేదు. మన బైబిలులో దా కీర్తనలో 16 : 11లో జీవమార్గము. కొండమీద మోషే జీవమార్గము అనగా
జీవముతో వున్నాడు. నీ కుడిచేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు.
సీనాయి
కొండపై సన్నిధిలో మోషే
1.
జీవముతో ఉన్నాడు.
2.
సంతోషముగా
ఉన్నాడు.
3.
సుఖముగా ఉన్నాడు.
మన
తెలుగు జిల్లాలో ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారము 90 దినములు దువుని సన్నిధిలో
ఆహారము నీరు లేకుండా ఉంది, గాని అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు త్రాగి 90 దినములు ఉండిపోయింది.
అక్కడనుండి
రాగా మోషే దగ్గరనుండి పెద్ద గీత. దావీదు రాజు వరకును. ఈ దావీదుకు తీరికలేదు, ఎప్పుడును యుద్ధములే
దావీదు గురించి బైబిలులో ఒకమాట ఉన్నది. మనిషి మనిషితో మాటలాడిన విధముగా దేవుడు
నాతో మాటలాడినాదాని దావీదు సాక్ష్యము ఇస్తునాడు. సినాయి కొండ మీద మోషేకు దేవుడు
వ్రాసి చూపించాడు. అట్లే దావీదుకు గాలిలో వ్రాసి చూపించినాడు గనుక మనమందరము
సన్నిధిలో వుండవలెను.
దీవెన : ఆలాగు
ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము, జీవభాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక, ఆమెన్. మరనాత.
Comments
Post a Comment