నిర్గమకాండములోని సన్నిధి నిర్గమ 25:22.
ప్రార్థన:- తండ్రీ! నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుచున్న తండ్రీ! వందనములు.
నీ సన్నిధిలేని స్థలములేధు. నీ సన్నిధికాంతి ప్రసరింపని చోటులేదు. పొడలోని
సన్నిధిని యెడలోనికి దించివేసినావు. నీ ఆశ్చర్యమర్మమెట్లు గ్రహింపగలము! సర్వ
సంపూర్ణత నీ సన్నిఘిలోనే ఉన్నది. సర్వము నీ సన్నిధిలోనే ఉన్నవి గనుక మాలో నీ సన్నిధి
పరిపూర్ణముగా నివసింపజేయుటకు నీ వాక్య సన్నిధిని మాలో ఉంచి, ఈ వాక్య భాగమును
వెలిగించుము. యేసునామమున అడుగుచున్నాము. ఆమెన్.
నిర్గమకాడములో ఒక కథ :-
ఒక పొద ఉన్నది. ఆ పొడలో
అగ్ని నాలుకలు వస్తున్నవి. అందులో ప్రభువున్నాడు. అక్కడ మోషే ఉన్నాడు. దేవుడు మోషేతో
మాటలాడినాడు. మోషే దేవునితో మాటలాడినాడు. నేను నీకు చూపించే దేశము వెళ్లుమని
అబ్రహాముతో అనగా వెంటనే దేవునిమాట ప్రకారం వెళ్ళేను.
ఇక్కడ దేవుడు మోషే
ఇగుప్తుకు వెల్లుమంటే నీవేవారినైనా పంపుకొనుము నేను వెళ్లలేను, నేను నత్తివాడను అని
సాకులు చెప్పగా దేవుడు బలవంతముగా పంపేను.
ప్రభువు అక్కడ ఒక మాట
చెప్పాడు. ఈ పొద స్థలము పరిశుద్ధస్థలము గనుక నీ చెప్పులు తీసివేయుము అని అన్నాడు.
మోషే దేవుని యోడుట ఎదిరించి ఏమన్నను బాగేగాని
పొద దగ్గర దేవునిచూచేను. దేవుని సన్నిధిని చూచేను. దేవుని మాటలు విన్నాడు.
ఎంత ధాన్యత! ఎంత ధన్యత! దేవుని ఎదిరించే ఈ మురాభి మనిషికి ఎంత ధాన్యత వచ్చింది!
దేవుని సన్నిధివల్లనే దాన్యథ వచ్చింది. సన్నిధివల్లనే చివరకు దేవునిమాట విన్నాడు.
ఈ
మురాభి మనిషికి ఎంత ధాన్యత వచ్చింది? ఈ మోషే దేవుని సన్నిధికి వెళ్లలేదు. గొర్రెలు కాయుటకు వెళ్ళేతే
దేవుని సన్నిధి వచ్చింది. ఒకదానికిపోతే మరొకటి వచ్చింది. అలాగే ఇప్పుడుకూడా ఎలాంటీ
దుర్మార్గుడైన సరే దువుని సన్నిధికి వెళ్ళారా? దొరికేడే దొరుకును.
1.
గద్దింపులు 2. వర్తమానము 3. అద్భుతములు. 4. ధైర్యము 5. సేవ 6. ఆదరణ. ఈ
మొదలైనవి దొరుకున నేడుకూడా దొరుకును. నేడును మీ గ్రామములలో సన్నిధి
కూటముపెట్టుకోండి. అప్పుడు ఇవన్నియు దొరుకును.
మోషే
పొద దగ్గరనుండి ఇగుప్తుకువెళ్లి, ఇగుప్తునుండి ఎర్రసముద్రముదాటి అడవిలో ఉన్న సీనాయి
పర్వతము ఎక్కినాడు. మంచి ఉన్నతమైన కొండ. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినాడు. అక్కడ
దేవునితో ముఖాముఖిగా దేవునితో మాటలాడే ధాన్యత దొరికింది. మానవల ఒకగంటకాదు. 40
రోజులు తిండి. తిప్పలులేవు. గొప్ప సన్నిధి. మనలో ఎవరైనా 40 దినములు దైవసన్నిధిలో
ఉంటే చచ్చిపోతారు. అన్నంలేక, నీళ్లులేక ఛస్తారు. ఈ మోషే
మాత్రము చావలేదు. మన బైబిలులో దా కీర్తనలో 16 : 11లో జీవమార్గము. కొండమీద మోషే జీవమార్గము అనగా
జీవముతో వున్నాడు. నీ కుడిచేతిలో నిత్య సుఖములు కలవు. ఇక్కడ మోషే సుఖముగా ఉన్నాడు.
సీనాయి
కొండపై సన్నిధిలో మోషే
1.
జీవముతో ఉన్నాడు.
2.
సంతోషముగా
ఉన్నాడు.
3.
సుఖముగా ఉన్నాడు.
మన
తెలుగు జిల్లాలో ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞ ప్రకారము 90 దినములు దువుని సన్నిధిలో
ఆహారము నీరు లేకుండా ఉంది, గాని అప్పుడప్పుడు కొద్దికొద్దిగా నీళ్ళు త్రాగి 90 దినములు ఉండిపోయింది.
అక్కడనుండి
రాగా మోషే దగ్గరనుండి పెద్ద గీత. దావీదు రాజు వరకును. ఈ దావీదుకు తీరికలేదు, ఎప్పుడును యుద్ధములే
దావీదు గురించి బైబిలులో ఒకమాట ఉన్నది. మనిషి మనిషితో మాటలాడిన విధముగా దేవుడు
నాతో మాటలాడినాదాని దావీదు సాక్ష్యము ఇస్తునాడు. సినాయి కొండ మీద మోషేకు దేవుడు
వ్రాసి చూపించాడు. అట్లే దావీదుకు గాలిలో వ్రాసి చూపించినాడు గనుక మనమందరము
సన్నిధిలో వుండవలెను.
దీవెన : ఆలాగు
ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషము, జీవభాగ్యము ప్రభువు మీకు దయచేయునుగాక, ఆమెన్. మరనాత.
Comments
Post a Comment