మోషే సుఖోపవాస కూటములు అనే పేరు ఎలవచ్చింది?
ప్రభువు చెప్పగా దైవజనుడు దేవదాసు
అయ్యగారు ఈ కూటములకు మోషే సుఖోపవాస కూటములని పేరు పెట్టియున్నారు. బైబిలు
గ్రంథములో హనోకు, అబ్రహాము, ఎలీయా, ఎలీషా, పేతురు, యోహాను, పౌలు మొ గు ఎందరో భక్తులు,
శిష్యులు, ప్రవక్తలు ఉండగా ఈ కూటములకు ఎందుకు మోషే పేరు
పెట్టబడినదో గమనించవలసిన వారమైయున్నాము.
430 సం ల కాలము దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయుల
ఇగుప్తలో బానిసత్వములో వున్నారు. 430 సం ల తరువాత మోషే అను దైవజనుని నాయకత్వమున
దేవుడు వారిని బానిసత్వము నుండి విడిపించి బయటకు తీసుకొని వచ్చినారు. అంతేకాక ఎర్ర
సముద్రమును దేవుడు పాయలు చేసి ఆరిన నేయలమీద నడిపించి ఆవలికి చేర్చి, వెనక వెంబడించుచు
నీళ్ళ గోడల మద్యనున్న శత్రువులైన ఇగుప్తీయులను
సీసమువలే మునిగిపోవునట్లు అద్భుతం చేశారు. మరియు చేదునీటిని మద్దురముగాను, బండలోనుండి నీరు వచ్చునట్లుగానూ, ఆకాశములోనుండి
పూరేళ్లు రప్పించి మాంసము అనుగ్రహించుటయేగాక దేవదుతాల ఆహారమైన మన్నాను కురిపించి, పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి
నడిపించుచూ సినాయి అనే కొండ వద్దకు చేర్చియున్నప్పుడు,
నిర్గమ కాండము 19, 24, 33 అధ్యాయములను
జాగ్రత్తగా అధ్యయనము చేసిన యెడల 1. కొండక్రింద నున్న ఇశ్రాయేలియులు, సినాయికొండ మీదికి దేవుడు రాగా సకిగిన ధూమమును,
అగ్నిని చూచినట్లు గాను (ముప్పడంతలు పంట).
2. కొండ మధ్యభాగమున నున్న మోషే, అహరోను, నాడాబు అభీహు, ఇశ్రాయెలియులలో 70 మండి దేవుని పాదాల
క్రిందనున్న నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు,
ఆకాశమండలపు తేజమువంటి దానిని చూచినట్లుగానూ ( అరవడంతల పంట) 3. ఆ తరువాత దేవుడు
పిలువగా కొండ శిఖరమునకు వెళ్ళిన మోషే దేవునిని ముఖాముఖిగా చూచినట్లుగానూ (నూరంతల
పంట) గమనించగలము ఈ పత్రికనను పాఠింమచుచున్న పాఠకులకు పై మూడు అనుభవములలో ఏ
అనుభవములో వున్నారో గమనించి దేవుని ముఖాముఖిగా చూచే అనుభవములోనికి రావలెనని, అందులాకేయ దేవుడు బైబిలు మిషనును బయలుపరచి యున్నారని గ్రహించగలరు. ఇందును
బట్టి ఈ కూటములకు మోషే సుఖోపవాస కుతములను పేరు కలిగినది. కేవలము శరీరక్ మిలుల
కొరకు మాత్రమే కాకుండా యుగయుగములు, యుగయుగాంతముల
రాజ్యామిచ్చే దేవుని వైపు చూచేదము.
Comments
Post a Comment